నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయనతోపాటు రష్యా అసమ్మతి నేత అలెక్సీ నవాల్నీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, పర్యావరణ మార్పులపై పోరాటం చేస్తున్న గ్రెటా థన్బర్గ్ కూడా నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యారు. ఒక్క ట్రంప్ మినహా మిగిలిన వాళ్లందరినీ నార్వేకు చెందిన చట్టసభ ప్రతినిధులు నామినేట్ చేశారు. నిజానికి నోబెల్ బహుమతుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా పార్లమెంట్లు సభ్యులు, సాధారణ ప్రజలు, మాజీ విజేతలు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఈ నామినేషన్ల గడువు ముగిసింది. అయితే నోబెల్ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా బయటపెట్టలేదు. 50 ఏళ్లుగా ఈ కమిటీ నామినీల పేర్లను, రేసులో ఉండి అవార్డు రాని వాళ్ల పేర్లను బయటపెట్టడం లేదు. కానీ నామినేటర్లు మాత్రం తమ నామినీల పేర్లను వెల్లడించవచ్చు. 2021 నోబెల్ బహుమతులను ఈ ఏడాది అక్టోబర్లో ప్రకటిస్తారు.






