తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ను కొట్టివేసింది. దాసోజు శ్రమణ్, కూర సత్యనారాయణల ఎన్నికను గవర్నర్ పునర్పరిశీలించాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామాకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్కు లేదని పేర్కొంది. కేబినెట్కు తిప్పిపంపాలి తప్ప తిరస్కరించకూడదని వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.