అమెరికా వేదికగా మాస్టర్ గేమ్స్లో మెరిసిన.. తెలంగాణ అథ్లెట్లు

నార్త్ అమెరికా వేదికగా జరుగుతున్న పాన్ అమెరికన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ టోర్నీలో తెలంగాణకు చెందిన జగ్జీవన్ రెడ్డి, శ్యామల పతకాలతో మెరిశారు. పురుషుల జావెలిన్త్రో విభాగంలో జగ్జీవన్రెడ్డి 22.56 మీటర్ల దూరం బరిసెను విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. మరోవైపు మహిళల షాట్పుట్లో శ్యామల 5.10 మీటర్ల దూరంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.