కోరమాండల్ కోటి విరాళం…సీఎం సహాయనిధికి

కరోనా నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎరువుల తయారీ సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కోటీ రూపాయల విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ రిలేషన్స్) కె.సత్యనారాయణ, ఎండీ సమీర్ గోయల్లు చెక్కును ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రగతి భవన్లో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి కూడా పాల్గొన్నారు.