విశాఖకు ఉపరాష్ట్రపతి రాక

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 26న విశాఖకు వస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఆయన నగరంలోనే నాలుగు రోజులపాటు బస చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇందుకు తగినట్లు స్థానికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పర్యటనలో భాగంగా తొలిరోజు విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముంది. 27న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వేడుకల్లో వర్చువల్ విధానంలో విశాఖ నుంచే పాల్గొంటారని సమాచారం అందినట్లు చెబుతున్నారు. పర్యటన వివరాళ్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.