శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి వివేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
ఉగాది ఆస్థానాన్ని బంగారువాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే అర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, అర్జిత బ్రహ్మోత్సవంలను టీటీడీ రద్దు చేసింది.






