వైసీపీ సూచించిన అభ్యర్థినే.. బీజేపీ పోటీ
వైసీపీ సూచించిన అభ్యర్ధినే బీజేపీ ఎన్నికల్లో పోటీకి పెట్టిందని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల పోటీతో తాము ఉన్నామని చెప్పుకోవడం కోసం బీజేపీ నేతలు తాపత్రయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికల కోసం ఏపీలో వలస పక్షులు తిరుగుతున్నాయని విమర్శించారు. తిరుపతి ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తాయని అన్నారు. తిరుపతిలో తమదే గెలుపు అని ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ అనడం హాస్యాస్పదమన్నారు. అస్సలు తిరుపతి సరిహద్దులు అయినా సునీల్ దేవధర్కి తెలుసా అని ప్రశ్నించారు.
తిరుమల శ్రీనివాసుని పాదాల చెంత ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న రత్నప్రభ జగన్ కేసులో ముద్దాయి కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బరిలో నిలిచిన చింతా మోహన్ గెలుపు.. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి మలుపు అని అన్నారు.













