ఏపీలో 2407 కు చేరిన కేసులు
ఆంధప్రదేశ్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,159 మంది సాంపిల్స్ పరీక్షించగా 68 మందికి కోవిడ్ 19 పాజిటివ్గా నిర్థారణయింది. కాగా గత 24 గంటల్లో 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్ కాగా, కరోనాతో ఇవాళ కర్నూలు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 53కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 715 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.






