ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కానుక అందించారు. పించన్లు రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. జవనరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తామన్నారు. దీని ద్వారా 54 లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతికేరాలు వ్యకమవుతున్నాయి.













