అమర్నాథ్ యాత్రికులకు హెచ్చరిక
అమర్నాథ్ యాత్రికులు తక్షణమే కశ్మీర్ విడిచి వెళ్లాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హోంశాఖ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై దాడులకు ప్లానేసినట్లు భారత ఆర్మీ పేర్కొన్నది. పాక్లో తయారైన ల్యాండ్మైన్లు, రైఫిళ్లలను భారత ఆర్మీ అమర్నాథ్ రూట్లో ఆర్మీ సీజ్ చేసింది. దీంతో కశ్మీర్లో ప్రస్తుతం అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో యాత్రికులు తమ యాత్రను రద్దు చేసుకోవాలని కోరుతున్నట్లు ప్రకటనలో చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.













