భారత్లో అమెరికా డిప్యూటీ రాయబారిగా ఎలిజిబెత్ జోన్స్
భారత్లో అమెరికా డిప్యూటీ రాయబారి (చార్జ్ డె అఫైర్స్)గా సీనియర్ విదేశాంగ శాఖ అధికారిణి ఎలిజిబెత్ జోన్స్ను జో బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 74 ఏళ్ల జోన్స్ ఇటీవల వరకు ఆఫ్గానిస్థాన్ పునరావస కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆమె త్వరలోనే ఢిల్లీ కి చేరుకోనున్నారు. ప్రపంచ వేదికలపై భారత్తో నిర్మాణాత్మక ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి జోన్స్ నియామకం చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. జోన్స్ గతంలో ఐరోపా`యూరేషియాకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పని చేశారు. మా రాయబారి జోన్స్ త్వరలోనే ఎంబసీ, కాన్సూలేట్ ఇంటర్ఏజెన్సీ బృందంలో చేరనున్నారు. మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పిన ప్రపంచంలోనే అత్యంత కీలక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు అని పేర్కొంది. ప్రస్తుతం పాట్రికా లాసినా న్యూఢిల్లీ ఈ స్థానంలో ఉన్నారు.













