ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం

18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగం చిరు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆంగ్లంలో ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.