తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి, 14 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి చొప్పున, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో రెండేసి అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.













