హైకోర్టులో డేరా బాబాకు ఊరట

డేరా సచ్చా సౌదా చీఫ్, వివాదాస్పద మతగురువు గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్కు పంజాబ్-హరియాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓ హత్య కేసులో అతడిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్ సురేష్వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన డివిజన్ బెంచ్ డేరా బాబా అప్పీల్ను పరిశీలించింది. వాస్తవానికి ఇప్పటికే పంచ్కులలోని సీబీఐ కోర్టు ఒక రేప్, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో బాబాను నిందితుడిగా పేర్కొంటూ తీర్పును ఇచ్చింది. దీనిని డేరాబాబా హైకోర్టులో సవాల్ చేశారు. వీటిల్లో తాజాగా రంజిత్ సింగ్ హత్యకేసులో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. ప్రస్తుతం అతడు రోహ్తక్లోని సునారియా జైల్లో ఉంటున్నాడు. ఈ కేసులో ఆయనతో పాటు మరో నలుగురు సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. డేరా బాబా దగ్గర మేనేజర్గా పనిచేసిన రంజిత్ సింగ్ 2002 జులై 10న హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్పూర్ కొలియన్ గ్రామంలో దారుణ హత్యకు గురయ్యారు.