రామ మందిరంలో ఘనంగా హోలీ వేడుకలు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో మొదటిసారి హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ పండగను పురస్కరించుకొని భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు. భక్తులు పెద్దఎత్తున రామ్లల్లాను దర్శించుకున్నారు. హనుమాన్గర్హి ఆలయంలోని దేవుని విగ్రహానికి రంగులు చల్లడంతో ఈ వేడుక ప్రారంభమైంది. భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తూ రంగులు చల్లుకుంటూ ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఆచార సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ బాలరాముని ప్రాణ ప్రతిష్ట అనంతరం ఎలాగైతే వేల సంఖ్యలో భక్తులు రాముడిని దర్శించుకున్నారనో, అలాంటి కోలాహలం నేడూ నెలకొంది. అయోధ్యకు బాలరాముడు రావడంతో ఈ సంవత్సరం హోలీ వేడుకలు మరింత సంబరంగా జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల కోసం ఆలయ ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు.






