భారత్ కు 50 కోట్ల డాలర్లు : అమెరికా

కరోనా సెకండ్ వేవ్తో అల్లాడుతున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా కూడా సాయం చేస్తోంది. ఇప్పటి వరకు భారతదేశానికి 50 కోట్ల డాలర్ల్ల సాయం చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. ఇక ముందు కూడా భారత్కు సహాయ సహకారాలు కొనసాగిస్తామని తెలియజేసింది. అంతేకాక వివిధ దేశాలకు 8 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపించనున్నట్లు వైట్హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు.
అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలో దక్షిణాసియా దేశాలకు మా సాయం అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వివిధ దేశాలకు ఆక్సిజన్, మాస్కులు, టెస్టింగ్ కిట్లు, మందులు పంపాం. త్వరలో పంపనున్న 8 కోట్ల వ్యాక్సిన్ డోసుల్లో 6 కోట్లు ఆస్ట్రాజెనికా, మరో 2 కోట్లు ఇతర వ్యాక్సిన్లను పంపుతాం. ఇంటిలిజెన్స్ నివేదికల ఆధారంగా భారత్తో పాటు, అవసరం ఉన్న ఇతర దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు పంపణీ చేస్తాం అని జెన్ సాకీ తెలిపారు.