దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో మోదీ భేటీ
15వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రమాఫోసాతో భేటీ అయ్యారు. బ్రిక్స్ సదస్సుకు ముందుగానే వీరి సమావేశం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి గురించి సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత పేదల దేశాల వాణిని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పని చేయడానికి గల మార్గాలను కూడా వారు చర్చించారు. రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సంరక్షణ, ప్రజల మధ్య సంబంధాలుతో సహా వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని నేతలు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.













