ఆ రెండు బిల్లులు పాసైతే… భారతీయలకు

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్దేశించిన గ్రీన్కార్డు మంజూరులో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 20వ శతాబ్దం మధ్యలో దేశాలకు పరిమితి విధించారు. ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్కార్డులో ఏ ఒక్క దేశానికి ఏడు శాతానికి మించి జారీ చేయకూడదని పరిమితి విధించారు. ఇప్పుడమే భారతీయ టెక్కీలకు శాపంగా మారాయి. అగ్రరాజ్యంలో పర్మనెంట్ రెసిడెంట్ హోదా పొందాలంటే జీవిత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చాక దేశాల పరమితిని ఎత్తేయడం కోసం రెండు బిల్లుల్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడంతో భారతీయుల్లో ఆశలు చిగురిస్తున్నారు. ఆ రెండు బిల్లులో ఏది ఆమోదం పొందిన భారతీయ టెక్కిలకు భారీ ఊరట లభిస్తుంది.
భారత్ నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన టెక్కీలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూన్నా గ్రీన్కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. చిన్న దేశాల నుంచి తక్కువ సంఖ్యలో వెళ్లేవారికి వెనువెంటనే గ్రీన్ కార్డు రావడం అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఏ దేశం నుంచి వచ్చారు అన్నది కాకుండా అమెరికాకు ఎంతవరకు వారి సేవలు ఉపయోగపడతాయి అన్నదే ఆధారంగా గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని డెమొక్రటిక్ ప్రజా ప్రతినిధి లోప్గ్రెన్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన వారే దేశంలో స్థిరపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు అండదండగా ఉంటారని, అందుకే కాలం చెల్లిన కంట్రీ క్యాప్ను తొలగించాలన్న డిమాండ్లు ఉపందుకున్నాయి. అదే జరిగితే, భారత్, చైనా దేశాలకు అత్యధికంగా గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల సమయంలో అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తామన్న హామీని నెరవేర్చుకోవడానికి అమెరికా పౌరసత్వం చట్టం 2021ను ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇందులో కూడా గ్రీన్ కార్డులకు సంబంధించి కంట్రీ కోటాను ఎత్తేయాలని ఉంది. ఈ బిల్లు ప్రకారం ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి ముందు గ్రీన్ కార్డు మంజూరు చేయాలి. గ్రీన్కార్డు మంజూరైన తర్వాత అయిదేళ్లకి అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చన్న ప్రస్తుత నిబంధనల్ని మూడేళ్లకి తగ్గించారు.