వ్యాక్సిన్ వేయించుకుంటే .. ఒక మిలియన్ డాలర్లు

కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కొన్ని దేశాలు, రాష్ట్రాలు బహుమతులు, ప్రోత్సహాకాలు సహాయం వంటివి చేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ఒహియో రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే అక్షరాల 7 కోట్లకు పైగా డబ్బులు మీ సొంతమే. ఒహియో రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాక్సిన్ వేయించుకుంటే లాటరీలో పాల్గొనవచ్చు. అందులో గెలిస్తే ఒక మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ వేయించుకోండి అని గవర్నర్ పిలుపునిచ్చారు.
మే 26వ తేదీన లాటరీ ఓపెన్ చేసి విజేతను ప్రకటిస్తామని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారికి లాటరీలో ఒక మిలియన్ డాలర్ల నగదు అందిస్తామని వెల్లడించారు. మే 18వ తేదీ నుంచి పెద్ద వారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని అన్నారు. 17 ఏళ్లలోపు వారందరూ వ్యాక్సిన్ వేసుకుంటే గెలిచిన వారికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్ల ఉపకార వేతనం అందిస్తామని ప్రకటించారు. దీంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు.