భారత్ లో సెంచరీ దాటేసిన ఒమిక్రాన్

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంతో వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ బాధితులు పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను అలెర్ట్ చేశాయి. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్న విదేశాల నుంచి వస్తున్న వారిలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో అధికశాతం విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లో 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో అనవసర ప్రయాణాలు, సామూహిక సమావేశాలకు దూరండా ఉండాలని తెలిపింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉన్న ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగే డెల్టా వేరియంట్ను ఒమిక్రాన్ అధిగమించే అవకాశం ఉందని తెలిపింది.