దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్..

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విజృంభిస్తున్నది. ఇప్పటి వరకు దేశంలో 200 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రంలో 54, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్లో 14, ఉత్తరప్రదేశ్లో 2, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 200 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 28 మంది, ఢల్లీిలో 12 మంది, కర్ణాటకలో 15 మంది, రాజస్థాన్లో 18, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ లో బాధితులు కోలుకున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.