కోవిడ్ -2 వేవ్ మనపై ప్రయోగించిన బయోలాజికల్ యుద్ధమా?

భారత ఉపఖండం మొత్తంమీద ఒక్క భారత్ లోనే ఇలా ఎందుకు అవుతున్నది? బంగ్లాదేశ్ , పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్ దేశాలలో ఎందుకు లేదు? అంటే భారత్ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే క్రమశిక్షణ లేని వారా? అమెరికా, చైనాలు కలిసి ఎకానమీ, ఫార్మా రంగాలని కాపాడుకోవడానికే ఇదంతా చేశారా? డొనాల్డ్ ట్రంప్ లాగా మోడీ గ్లోబల్ ఆయుధ, ఫార్మా, ఆయిల్ లాబీలకి. లొంగకుండా ముందుకు వెళ్తునందుకే ఇదంతా జరుగుతున్నదా? ఒకసారి వాస్తవ విషయాలలోకి వెళ్ళి లోతుగా పరిశీలిస్తే అసలు నిజం బోధపడుతుంది.
ముందు డొనాల్డ్ ట్రంప్ ఓటమి వెనక ఉన్న వాస్తవాలు ఏమిటో చూద్దాము. నాటో(NATO) దేశాల రక్షణ అమెరికా బాధ్యత కాదు అన్నాడు ట్రంప్. అంటే నాటో కూటమి దేశాల కంటే కూటమిలో ఉన్న అమెరికా ఎక్కువ డబ్బు ఖర్చుపెడుతున్నది. యూరోప్ అంతటా మిలటరీ బేస్లు పెట్టి అమెరికన్ సైనికులని అక్కడ మోహరించి ఉంచడం చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. అందుకే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుంది అని చెప్పేశాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పని చేసేవాడు. ఇది అమెరికన్ ఆయుధ లాబీకి అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఉద్రిక్తతలు ఉండాలి అక్కడికి అమెరికా సైన్యం వెళ్ళాలి. ఆయుధాలు అమ్ముడుపోవాలి. కానీ ట్రంప్ ఉంటే ఇవన్నీ జరగవు. ఇక బ్లాక్స్ లైవ్స్ మ్యాటర్ (Black Lives Matter) నినాదంతో ట్రంప్ మీద విపరీతమయిన దుష్ప్రచారం చేశారు. ప్రతి ఒక పోలీసుని ఏ దేశ ప్రధాని కావచ్చు, లేదా అధ్యక్షుడు కానీ నియంత్రించ లేరు. కానీ అది ట్రంప్ కి అంటగట్టారు విజయవంతంగా…అప్పటికి నల్లజాతి వాళ్ళ మీద అదే మొదటి దాడి జరిగినది అనే విధంగా! ఆయుధ లాబీ పాచిక పారింది. ట్రంప్ ఓటమికి ఏవైతే శక్తులు వెనక ఉండి ప్లాన్ చేశాయో అవే ఇప్పుడు మోడీమీద తమ శక్తియుక్తులు ప్రయోగిస్తున్నాయి. కోవిడ్ మొదటి దశని విజయవంతంగా దాటడం అనేది భారతదేశ చరిత్రలో అతి పెద్ద విజయం. గత 2020 జనవరి నెలలో పశ్చిమ దేశాలు జోస్యం చెప్పింది ఏమిటంటే భారత్ లో హీన పక్షం ఓ రెండు కోట్ల మంది కోవిడ్ వల్ల చనిపోతారు అని. కానీ వాళ్ళ జోస్యం నిజం కాలేదు సరికదా మరణాల సంఖ్య రెండు లక్షలలోపే జరిగింది. పైగా హైడ్రాక్లోరోక్విన్ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయగలిగింది. నిజానికి 2020లో ఇదే సమయానికి అమెరికా, యూరోపుతో సహా మిగతా ప్రపంచదేశాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. కానీ భారత్ మాత్రం పెద్దగా నష్టం లేకుండానే బయటపడగలింది. చివరకి చైనా తొత్తు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధ్యక్షుడు కూడా భారత్ని చూసి కోవిడ్ని ఎలా ఎదుర్కోవాలో మిగతా దేశాలు నేర్చుకోవాలి అంటూ ఒక ప్రకటన చేశాడు గతిలేక.
గ్లోబల్ ఫార్మా లాబీకి కష్టం!
ఇక వాక్సిన్ విషయంలో అన్ని దేశాల కంటే ముందే ఉత్పత్తి ప్రారంభం చేసి వాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టింది భారత్. సరిగ్గా ఇక్కడే గ్లోబల్ ఫార్మా లాబీకి కష్టం అనిపించింది. ప్రతి సంవత్సరం గ్లోబల్ ఫార్మా చేసే వ్యాపార విలువ సుమారుగా 6ట్రిలియన్ డాలర్లు (అక్షరాలా 4,44,60,000 కోట్ల రూపాయలు) ఉంటుంది. ఇక వాక్సిన్ వ్యాపారం అయితే 1.25 ట్రిలియన్ డాలర్లు (అక్షరాలా లి92,62,500కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా కానీ భారత్ బయోటెక్ కోవాక్సిన్, లైసెన్స్ తీసుకొని తయారు చేస్తున్న కొవీషీల్డ్ ఉత్పత్తి రేటు మిగతాదేశాలకంటే ఎక్కువ. పైగా ధర విషయంలో మిగతా దేశాలకంటే 60% తక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకి మింగుడు పడడం లేదు. ఇదే మోడీ పట్ల ద్వేష భావం నెలకొనడానికి కారణం అయ్యింది. చివరకి జర్మనీ ఛాన్సెలర్ ఆంజెలామోర్కెల్ అయితే భారత్ ఫార్మా రంగ హబ్ అవడం మనం చేసిన తప్పు అంటూ బహిరంగంగా ప్రకటించింది అంటే ఎంత అక్కసు ఉందో తెలిసిపోయింది. ఇక్కడ ప్రధానంగా ఆస్ట్రా జెనీకా వల్ల రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మరణాలు సంభవించాయి. యూరోపులో ఇదే సమయంలో అదే లైసెన్స్ తీసుకొని భారత్లో తయారుచేసిన కోవీషీల్డ్ వల్ల అలాంటి దుష్ప్రభావాలు కలిగినట్లు ఎక్కడా ఫిర్యాదులు లేవు.
ఇదంతా వొట్టిదే అనే వాళ్ళకి ఒక సూటి ప్రశ్న:
ఇరాక్లో రసాయన ఆయుధాలు ఉన్నాయి అంటూ అమెరికా నాటో దళాలు దాడి చేసి లక్షల మందిని చంపేశాయి. కానీ అక్కడ రసాయన ఆయుధాలు ఏవీ కూడా దొరకలేదు. అందరూ అనుకున్నట్లు అమెరికా ఆయిల్ కోసమే ఇదంతా చేసింది అన్నది పచ్చి అబద్ధం. కేవలం తమ ఆయుధాలని పరీక్షించుకోవడానికే ఇదంతా చేసింది.
అలాగే 2011లో లిబియా మీద దాడి కూడా ఆయుధాలని పరీక్షించడం కోసమే కాకపోతే అప్పుడు ఫార్మా లాబీ ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే లిబియాలో మహమ్మద్ గడ్డాఫీ ప్రజలు అందరికీ అది ఎలాంటి వ్యాధి అయినా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స అందిస్తూ వచ్చాడు. దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్కి పని లేకుండా పోయింది. ఇది ఫార్మా లాబీకి నష్టం. ఇక ఆయుధ లాబీకి అయితే మొదటి సారిగా రష్యా చైనాల రాడార్ల వల్ల తమ యుద్ధ విమానాలకి హాని ఉంది అని తేల్చుకున్నాకే నాటో దేశం అయిన ఫ్రాన్స్ చేత మొదటి దాడి చేయించింది. అది కూడా రాఫెల్ జేట్లు ముందు లిబియా రాడార్ వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటూ దాడులు చేస్తూ పోతే వెనుక అమెరికన్ ఎఫ్16, ఎఫ్15, ఎఫ్22 లు మిగతా పని పూర్తి చేశాయి అంటే ఇక్కడ అమెరికన్ ఫైటర్ జెట్స్ కంటే రాఫెల్ జెట్స్ ఎయిర్ డిఫెన్స్ ని చక్కగా ఛేదించగలిగాయి. తరువాతి కాలంలో రాఫెల్ తన PESA రాడార్ ని తీసేసి AESA రాడార్లని వాడడం మొదలుపెట్టాక అది ఇంకా డెడ్లీ ఫైటర్ అయి కూర్చుంది. దాంతో అమెరికా తన ఎఫ్ 35 ల కోసం ఎయిర్ డిఫెన్స్ మీద కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది రాఫెల్ నుండి వచ్చే పోటీని ఎదుర్కోవడానికి. ఇప్పుడు జో బిడెన్ మంత్రి వర్గంలోని అధికారులు అందరూ దాదాపుగా లెఫ్ట్ వింగ్ని సమర్ధించేవాళ్లే కాబట్టి కనపడకుండా చైనాకే మద్దతుఇస్తారు, తీసుకుంటారు.
మోడీ ప్రధాన మంత్రిగా ఉంటే అటు ఫార్మా లాబీతో పాటు ఆయుధ లాబీ కూడా నష్టపోతుంది.నల్ల జాతీయుడు (జార్జ్ ఫ్లాయిడ్)ఒక అమెరికన్ పోలీసు చేతిలో హతమవ్వడం, దానిని ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రంగా వాడుకొని లెఫ్ట్ వింగ్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే లాబీ చైనా, కాంగ్రెస్ మద్దతుతో కోవిడ్ని భూతంగా చూపించి దానికి మోడీనే బాధ్యుడుగా చిత్రీకరిస్తున్నది. మోడీ ఉన్నంత కాలం DRDO చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి అది తమకి నష్టదాయకం. మోడీని ఏదో విధంగా దించాలి. ‘ఈ కుట్రలని ఛేదించుకొని మోడీ మనగలరా? లేక ట్రంప్ లాగా బలిఅవుతారా? అన్నది మనమీదే ఆధారపడి ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
- గ్లోబల్ ఫార్మా రంగం ఆశించింది అసలు జరగలేదు: మాస్క్లు, పిపిఇ కిట్లు, వెంటిలేటర్ల మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్లు. (అక్షరాలా 37,05,000 కోట్ల రూపాయలు). కానీ గ్లోబల్ ఫార్మాకి భారత్ ఆ అవకాశం ఇవ్వలేదు. అన్నీ మన దేశంలోనే తయారు చేసుకున్నాము.
- ఇక వాక్సిన్ ఎగుమతులు చేసి 1.25 ట్రిలియన్ డాలర్లు సంపాదించాలి అనుకున్న గ్లోబల్ ఫార్మా ఆశల మీద కూడ నీళ్ళు చల్లింది భారత్. రెండు వాక్సిన్లు భారత్లోనే తయారు చేసుకోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు.
- బైడెన్ అధికారంలోకి రాగానే ఫార్మా లాబీ సంస్థలు భారత్కి వాక్సిన్ తయారీ కోసం వాడే ముడి పదార్ధాల మీద నిషేధం విధించమని తీవ్ర ఒత్తిడి తెచ్చి విజయం సాధించాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్ కోసం ముందే రా మెటీరీయల్ బుక్ చేసుకుంది. అంటే మిగతా వాళ్ళకి ముఖ్యంగా భారత్ ని అడ్డుకోవడానికే చేసింది. మరీ దారుణం ఏమిటంటే జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది అన్నీ జరిగి వాక్సిన్ బయటికి రావడానికి ఇంకో రెండు నెలలు పడుతుంది. కానీ ముందే రా మెటీరీయల్ తయారు చేసే అమెరికన్ ఫార్మా సంస్థలకి భారీ మొత్తంలో ఆర్డర్ చేసింది. దాంతో భారత్కి ఓపెన్ మార్కెట్లో వాక్సిన్ రా మెటీరీయల్ కొనడం కష్టం అయింది. ఎందుకంటే ముందు ఇచ్చిన ఆర్డర్లు డెలివరీ అయ్యాకే మనకి ఇస్తాయి అమెరికన్ సంస్థలు. అంటే హీన పక్షం మరో మూడు నెలలు వరకు మనకి రా మెటీరీయల్ దొరికే అవకాశం లేదు. ఇది మన మార్కెట్ ని నిలువరించడానికి చేసిన కుట్ర ఇది. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్ కోసం ఆర్డర్ చేసిన రా మెటీరీయల్ మనకి ఇవ్వమని కోరినా ఒప్పుకోలేదు అమెరికన్ ఫార్మా సంస్థలు.
- ఇక ఇంత హఠాత్తుగా సెకండ్ వేవ్ విజృంభించడానికి కారణాలు సుస్పష్టం. ప్రస్తుతం విజృంభిస్తున్న కోవిడ్ రెండుసార్లు మార్పు చెందినట్లు పరీక్షలలో తేలింది. అంటే ఇది ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యాప్తి చేసినట్లు కనపడుతున్నది. దీనికి కారణం వెస్ట్ బెంగాల్లో ఉన్న చికెన్ నెక్ ప్రాంతం ప్రధానంగా చెప్తున్నారు. ఈ చికెన్ నెక్ ప్రాంతం నుండే డబుల్ మ్యూటేషన్ చేసిన వైరస్ని వదిలినట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాదు. కానీ ఒకేసారి డబుల్ మ్యూటేషన్ ఎలా జరుగుతుంది? ఇది ఖచ్చితంగా బయో వార్ మన మీద. లేకపోతే కేవలం భారత దేశంలోనే ఇది ఎందుకు విజృంభిస్తున్నది? పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలలో ఎందుకు లేదు?
- పోయిన సంవత్సరం కూడా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడే చైనా సరిహద్దుల్లో తిష్ట వేసింది. అలాగే ఇప్పుడు 2 వేవ్ ఉధ•తంగా ఉన్న సమయంలో మళ్ళీ సవాల్ విసురుతున్నది.
- గ్లోబల్ ఆయుధ లాబీ: ఆయుధాలు తయారుచేసి అమ్మాలంటే అది అమెరికాతో పాటు యూరోపు మాత్రమే చేయాలి. మిగతా దేశాలు చేయకూడదు. ఇదీ అమెరికన్ ఆయుధ లాబీ సిద్ధాంతం! అందుకే టర్కీ ఎప్పుడయితే రష్యా నుండి ఎస్400 కొనడానికి ఒప్పందం చేసుకుందో వెంటనే ఆంక్షలు విధించింది అమెరికా. ఆఫ్ కోర్స్! రష్యా నుండి ఎస్ 400 మొదటి రెజిమెంట్ భారత్కి రాగానే మన మీద కూడా ఆంక్షలు విధిస్తాడు జో బిడెన్.
- తేజస్ యుద్ధ విమానం కోసం మలేసియా ఆసక్తితో ఉంది. ఒకవేళ కనుక మలేసియా కనుక ఆర్డర్ ఇస్తే అది అమెరికన్ ఆయుధ లాబీకి ఇష్టం ఉండదు. కొంటే అమెరికా నుండి కొనాలి లేదా యూరోపు నుండి కొనాలి కానీ భారత్ లాంటి దేశం నుండి కొంటే అది భవిష్యత్తులో తమకి పోటీ ఉంటుంది అన్నది స్పష్టం కనుక అమెరికన్ ఆయుధ లాబీకి భారత్ లో మోడీ ఉండడం ఇష్టం లేదు.
- ఫీలిప్పైన్స్ ఆల్రెడీ బ్రహ్మోస్ మిసైల్ కోసం భారత్తో ఒప్పందం చేసుకున్నది కానీ మళ్ళీ అదే అమెరికన్ ఆయుధ లాబీకి ఇష్టం లేదు. ఎందుకంటే యుద్ధ విమానాల తరువాత అతి పెద్ద వ్యాపార మార్కెట్ మిసైల్స్దే ! మోడీ ఉంటే మరిన్ని దేశాలకి ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ముందు తమ వ్యాపారానికి కష్టం అవుతుంది. పైగా భారత్ ఆయుధాలు అంటే తేజస్ కావచ్చు లేదా మిసైల్ వ్యవస్థ కావచ్చు చాలా చవకగా దొరుకుతాయి. ఇది అమెరికన్ ఆయుధ లాబీకి నష్టాన్ని కలగచేస్తుంది. భారత్ తో ధరల విషయంలో పోటీ పడలేదు అమెరికన్ ఆయుధ లాబీ.
- అమెరికన్ నేవీ ఇప్పటికే రెండు నావల్ వెర్షన్ తేజస్ ఫైటర్ జెట్స్ని కొన్నది తమ నేవీ పైలట్ల శిక్షణ కోసం. ఎందుకంటే శిక్షణ కోసం చాలా కొద్దిలైట్ కాంబాట్ జెట్స్ అవసరం అవుతాయి కాబట్టి. అమెరికన్ సంస్థలు ఆ పనిచేయలేవు. ఎందుకంటే దానికోసం ప్రత్యేకంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి. కానీ ఆర్ధికంగా చాలా ఖరీదు అవుతుంది. భవిష్యత్తులో తమ దగ్గర ఉన్న కారియర్ల రక్షణ కోసం హీన పక్షం 150 తేలికపాటి యుద్ధ విమానాల అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ తేజస్ ని వాడుతున్నారు కాబట్టి ఆ 150 జెట్స్ కోసం భారత్కే ఆర్డర్ ఇచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం కాబట్టి ఇది కూడా అమెరికన్ లాబీకి ఇష్టం లేదు.
- గ్లోబల్ ఆయిల్ లాబీ: పెట్రో డాలర్ల వ్యాపారం. వచ్చే సంవత్సరం భారత్లో కనీసం 75,000 నుండి 1,00,000 వరకు ఎలెక్ట్రిక్ కార్ల కోసం ఛార్జింగ్ స్టేషన్లు స్థాపించబోతున్నది భారత్. ఇదే జరిగితే ఎలెక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరు అందుకుంటాయి. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లు లేవు కాబట్టి అమ్మకాలు పెద్దగా లేవు. అదే మోడీ కనుక ఉండకపోతే మరో పదేళ్ళు వరకు ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం జరగదు. ఎందుకంటే తమకి అనుకూలమయిన ప్రధాని ఉంటాడు కాబట్టి. ఇది పెట్రో డాలర్ లాబీ అంచనా. ఛార్జింగ్ స్టేషన్ల వల్ల హీన పక్షం 25% ఆయిల్ దిగుమతి పడిపోతుంది ఇది ఆయిల్ లాబీ బాధ.
- దాదాపు 15 కోట్ల మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యా లు వెస్ట్ బెంగాల్లో అస్సాంలో ఉన్నారు. మమతాబేగంతోపాటు కాంగ్రెస్ వీళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చింది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు వీళ్ళకి ప్రధానం. అందుకే వీటి కోసం ఏం చేయడానికయినా వెనుకాడరు.
-హర్షవర్థన్ ముప్పవరపు
వాట్సాఫ్ సందేశం నుంచి