ప్రపంచ దేశాలకు 10 కోట్ల… వ్యాక్సిన్ డోసులు

వచ్చే ఏడాదిలోగా 10 కోట్ల మిగులు వ్యాక్సిన్ డోసులను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. జీ7 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ప్రారంభోపన్యాసంలో ఈ విషయం వెల్లడించారు. బ్రిటన్, ఇతర సంపన్న దేశాలు కలసి వందకోట్ల డోసులు, తగురుణ సాయం అందించేందుకు జి-7 ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆన్లైన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుండి మానవాళిని రక్షించే చర్యల్లో బ్రిటన్ అగ్రస్థానంలో ఉందని జాన్సన్ పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ -ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అభివృద్ధికి నిధులు సమకూర్చామని తెలిపారు. ఇప్పటివరకు 160 దేశాల్లో యాభై కోట్ల డోసులకు పైగా వేశారని తెలిపారు.