ఏపీలో కొత్తగా 7,073 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. 24 గంటల వ్యవధిలో 69,429 నమూనాలను పరీక్షించగా 7,073 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 8,695 మంది కోలుకోగా.. 48 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 8, అనంతపురం 6, కృష్ణా 5, పశ్చిమగోదావరి 5, కడప 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, కర్నూలు 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,606కి చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 54,47,796 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్లో పేర్కొన్నారు.






