ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తగ్గినట్లే కనిపించిన కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 76,000 పరీక్షలు నిర్వహించగా 7,855 మంది కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 6,54,385కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 8,807 మంది కరోనా నుంచి కోలుకోగా 52 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురం 6, గుంటూరు 6, కృష్ణా 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పు గోదావరి 4, కడప 3, కర్నూలు 3, పశ్చిమగోదావరి 3, విజయనగరం 2, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,558కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 53,78,367 నమూనాలను పరీక్షించారు.






