మరో భారత-అమెరికన్ కు కీలక పదవి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత-అమెరికన్ కు కీలక పదవి దక్కింది. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, మాస్టర్కార్డ్ సెంటర్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ వ్యవస్థాపకురాలు షమీనా సింగ్ ను ఎగుమతుల మండలి సభ్యరాలిగా బైడెన్ నియమించారు. ఈ మేరకు అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎగుమతుల మండలిలో షమీనా కీలక పాత్ర చేపట్టనున్నట్లు శ్వేతసౌదం తెలిపింది. తన నియామకంపై షమీనా ఆనందం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఎగుమతుల కమిటీలో చేరడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ మండలి అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తుంది. వాణిజ్యం, ఎగుమతుల విస్తరణ, వాణిజ్య సంబంధ అంశాలపై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ఈ మండలి అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంటుంది. బైడెన్ యంత్రాంగంలో ఇప్పటికే దాదాపు 150కి పైగా భారత అమెరికన్లు కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా షమీనా సింగ్ కూడా ఈ జాబితాలో చేరారు.






