అమెరికాలో అజిత్ దోవల్
వాషింగ్టన్లోని పెంటగాన్ కార్యాలయంలో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్తో భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. భారతీయ అంబాసిడర్నవ్తేజ్ సర్నా కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. దక్షిణ ఆసియా ప్రాంతంలో శాంతిస్థాపనకోసం భారత్ చేస్తున్న కృషిని అమెరికా రక్షణ మంత్రి కొనియాడారు.







