‘లైగర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు చాలా తక్కువన్న విజయ్ దేవరకొండ

‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తర్వాత అదే జోష్లో ‘లైగర్’ సినిమా రూపొందిస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ మూవీ రిలీజ్ ఆలస్యమవుతుండటంతో ఓటీటీ దిశగా ఆలోచనలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ‘లైగర్’. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత అదే జోష్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం పైగా షూటింగ్ ఫినిష్ చేసిన పూరి.. చిత్ర అప్డేట్స్ బయటకు వదిలి సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. దీంతో ప్రతిఒక్కరి చూపు ఈ సినిమాపైనే పడింది. ఈ నేపథ్యంలో లైగర్ సినిమాను ఓటీటీ వేదికపై రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘లైగర్’ చిత్రానికి ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని, పూరి జగన్నాథ్ ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో సంప్రదింపులు జరుపుతోందని.. ఏకంగా 200 కోట్ల భారీ మొత్తంతో అన్ని హక్కులు కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ రెడీగా ఉందనే న్యూస్ వైరల్ అయింది. పరిస్థితుల్ని బట్టి వచ్చే నెలలో పూరి జగన్నాథ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అన్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా షూటింగ్ ఫినిష్ చేసేసి.. ఓటీటీలో అయినా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని చెప్పుకున్నారు. దీంతో ఈ వార్తలపై నేరుగా రియాక్ట్ అయ్యారు హీరోవిజయ్ దేవరకొండ. ”లైగర్ కోసం 200 కోట్లు చాలా తక్కువని, థియేటర్స్లో అంతకంటే ఎక్కువ రాబడతాం” అని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. అంటే ఈ మూవీపై రౌడీ స్టార్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అర్థం చేసుకోవవచ్చు.