భారత్ పై అమెరికా ప్రశంసలు
క్వాడ్ కూటమికి చోదక శక్తి భారతేనని, దక్షిణాసియాలో ప్రాంతీయాభివృద్ధికి సారథ్యం వహిస్తోందని అమెరికా పేర్కొంది. వైట్హౌజ్ ప్రినిసపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ కెరిన్ జీన్ పియరీ మాట్లాడుతూ భారత్ మా భావ సారూప్య భాగస్వామి. దక్షిణాసియాలో, హిందూ మహాసముద్ర పరిధిలో నాయకత్వ స్థానంలో ఉందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్లతో కూడిన క్వాడ్ ఇటీవలే పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై లోతైన చర్చ జరిగిందని ఆమె తెలిపారు. దక్షిణాసియాలో స్థిరత్వ సాధనతో పాటు ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్స్పేస్ తదితరాల్లో భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకుంటామన్నారు.






