అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్ ఒకటి అని ఆయన అన్నారు. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాస్ ఏంజిల్స్లో జరిగిన డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో బైడెన్ ఈ కామెంట్ చేశారు. ఆ సమావేశంలో చైనా, రష్యా తీరును కూడా ఆయన ఖండిరచారు. చైనా, రష్యాతో ఉన్న విదేశాంగ విధానంపై మాట్లాడుతున్న నమయంలో పాక్పై బైడెన్ ఆ వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ ఈవెంట్లో బైడెన్ చేసిన వ్యాఖ్యలను వైట్హౌజ్ ప్రెస్ రిలీజ్ చేసింది. బైడెన్ వ్యాఖ్యల వల్ల పాక్ పరిస్థితి దయనీయంగా మారింది. అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని షెబాజ్ షరీప్ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ వ్యాఖ్యలు పాక్కు శాపంగా మారనున్నాయి. 21వ శతాబ్దం రెండవ క్వార్టర్లో అమెరికాను డైనమిక్గా మార్చేందుకు అనేక అవకాశాలు ఉన్నట్లు బైడెన్ తెలిపారు.






