యూఎస్టీడీఏ సీఓఓగా వినయ్ తుమ్మలపల్లి
అమెరికాలో మరో భారతీయుడికి అత్యున్నత పదవి లభించింది.ప్రవాస భారతీయుడు వినయ్ తుమ్మలపల్లిని ప్రభుత్వ నిర్వహణలోని అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ (యూఎస్టీడీఏ) డిప్యూటీ డైరెక్టర్, ప్రధాన నిర్వహణ అధికారి (సీఓఓ)గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. విదేశాలతో అమెరికాతో వాణిజ్య అభివృద్ధి యూఎస్టీడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్కు చెందిన వినయ్ 1974లో అమెరికా వచ్చారు. అమెరికాలో ఉన్నత విద్యాబ్యాసం చేసేటప్పుడు వినయ్, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాకు రూమ్మేట్గా ఉన్నారు. ఒబామా తన హయాంలో వినయ్ను సెంట్రల్ అమెరికా దేశమైన బెలిజికి అమెరికా రాయబారిగా నియమించారు.
ప్రైవేటు రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న వినయ్ వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. అమెరికాలోని కొలరాడోలో ఆయనకు రికార్డబుల్ సీడీ`ఆర్, డీవీడీ`ఆర్ ఆప్టికల్ డిస్కుల తయారీ యూనిట్ కూడా ఉంది.






