దేశ చరిత్రలోనే ఇది సిగ్గు పడాల్సిన రోజు
అల్లర్లతో అమెరికాలోని వాషింగ్టన్ అట్టుడికిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై చేసిన దాడితో యావత్ ప్రపంచం నివ్వెరపోయిది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటనను ఎంతో మంది తీవ్రంగా ఖండించారు. ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా దీనిపై స్పందించారు. వాషింగ్టన్ లో జరిగిన హింసను ఖండిస్తున్నామంటూ గూగుల్ ఉద్యోగులకు పంపిన మెయిల్లో సుందర్ పిచాయ్ తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విచారణకమైన, సిగ్గు పడాల్సిన రోజు అని అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను జో బైడెన్ తీసుకునే కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయాలని కోరారు.






