ముందే శ్వేతసౌధాన్ని వీడనున్న డొనాల్డ్ ట్రంప్!
అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20వ తేదీన (బుధవారం) జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయక ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు తీసుకోనున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వాషింగ్టన్ నగర శివారుల్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ట్రంప్ వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. అక్కడ నుంచి ఫోర్స్ వన్ విమానంలో డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం 7:15 గంటకల్లా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానితులకు పంపిన ఇన్విటేషన్లో పేర్కొన్నట్లు సమచారం.
తొలి నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే శ్వేతసౌధానికి వచ్చే జో బైడెన్కు ఎదురుపడేందుకు ట్రంప్ అనుకూలంగా లేరు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోనని ముందే ట్రంప్ ప్రకటించారు. గత శతాబ్ద కాలంలో అధికార మార్పిడికి దూరంగా ఉంటున్న డొనాల్డ్ ట్రంప్ మొదటి వారు కానున్నారు.






