మరో భారతీయురాలికి కీలక పదవి… ఫెడరల్ జడ్జిగా
అగ్ర రాజ్యం అమెరికాలో మరో భారత సంతతి పౌరురాలు, అమెరికన్ పౌర హక్కుల న్యాయవాది సరళ విద్య నాగాలాను కీలక పదవికి అధ్యక్షుడు జో బైడెన్ సిఫార్సు చేశారు. కనెక్టికట్ రాష్ట్రానికి ఫెడరల్ జడ్జిగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సెనేట్ ధ్రువీకరించింది. ఆమె నియామకం ఖారారైతే.. దక్షిణాసియాకు చెందిన తొలి ఫెడరల్ జడ్జి అవుతారు.
సరళా ప్రస్తుతం కనెక్టికట్ జిల్లాలోని యూఎస్ అటార్నీ కార్యాయలంలో మేజర్ క్రైమ్స్ యూనిట్కు డిప్యూటీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. 2017 నుండి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2012లో యూఎస్ అటార్నీ కార్యాలయంలో చేరిన ఆమె.. హేట్ క్రైమ్స్ కో ఆర్డినేటర్ సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. 2008లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బర్కిలీ స్కూల్ ఆఫ్ లా నుండి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, 2005లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్టస్ డిగ్రీని అందుకున్నారు. 2009లో జడ్జి సుషాన్ గ్రాబేర్ వద్ద గుమాస్తాగా వ్యవహరించారు.






