జో బైడెన్ మరో కీలక నిర్ణయం
రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అనుమతిచ్చిన తర్వాతి రోజే జో బైడెన్ సర్కార్ మరో దూడుకు నిర్ణయాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా సేనలు చొచ్చుకురాకుండా ఉండేలా, యాంటీ-పర్సనల్ మైన్స్ను ఇవ్వాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ ఈ మందుపాతరలను తూర్పు ప్రాంతాల్లో ( డాన్బాస్, ఖెర్సోన్, మారియూపోల్) వినియోగించనుంది. ఈ ప్రాంతాల్లో రష్యా సేనలు స్థిరంగా చొచ్చుకువస్తుండడంతో, యాంటీ-పర్సనల్ మైన్స్తో చెక్ పెట్టవచ్చని అమెరికా భావిస్తోంది. ఇవి ప్రమాదకరమైనవి. వాటిపై కాలు పెడితే శాల్తీలే లేచిపోతాయి. లేదంటే శాశ్వత అంగవైక్యలం మిగులుతుంది. అయితే అమెరికా సరఫరా చేయనున్న యాంటీ`పర్సనల్ మైన్స్లకు టైమర్లు ఉంటాయని, నిర్ణీతీ కాలం ( బ్యాటరీ సామర్థం మేరకు 4 గంటల నుంచి 2 వారాలు) తర్వాత వాటంతట అవే నిర్వీర్యం అయ్యేలా ప్రోగ్రామ్ చేసి ఉంటాయని అమెరికా పేర్కొంటోంది.






