ప్రాన్స్, అమెరికా సంయుక్త ప్రకటన.. అక్టోబరు చివరి వారంలో
ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములు విక్రయంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్లు మొదటిసారిగా మాట్లాడుకున్నారు. ఉద్రికత్తలు తగ్గించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఫోన్కాల్ అనంతరం సంయుక్త ప్రకటన చేస్తూ, విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి మరింత కూలంకషంగా చర్చలు జరిపే క్రమాన్ని ఆరంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. అక్టోబరు చివరిలో యూరప్లో సమవేశం కావాలని కూడా భావించారు. ఫ్రాన్స్ ఆగ్రహాన్ని అమెరికా గుర్తించినట్లుగా వైట్హౌస్ నుండి ఒక ప్రకటన వెలువడిరది. ఫ్రాన్స్, మా యూరోపియన్ భాగస్వాములకు వ్యూహాత్మక ఆసక్తి గల విషయాలపై మిత్ర పక్షాల మధ్య బహిరంగ సంప్రదింపుల ద్వారా ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది.






