అటార్నీ జనరల్గా…. తొలి భారత సంతతి మహిళ
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్గా వనితా గుప్తా నియామకమయ్యారు. ఈ పదవి చేపట్టనున్న శ్వేతజాతియేతర, తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అసోసియేట్ అటార్నీ జనరల్గా వనితా గుప్తా నియామకాన్ని ధ్రువీకరించేందుకు యూఎస్ సెనేట్లో ఓటింట్ నిర్వహించగా 51 ఓట్లు సాధించారు. వంద మంది సభ్యులున్న సెనేట్లో రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలకు చెరో 50 మంది సభ్యులున్నారు. టై అయితే ఓటే వేసేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఓటింగ్కు హాజరయ్యారు. న్యాయవిభాగ నామినీగా వనితను అధ్యక్షుడు జో బైడెన్ వనితను ఎంపిక చేశారు.
వనిత మొదట ఎన్ఏఏసీపీ లీగల్ డిఫెన్స్ ఫండ్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్లో విధులు నిర్వర్తించారు. అనంతరం ఒరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించారు. అసోసియేట్ అటార్నీ జనరల్గా వనితా గుప్తా విజయం సాధించినందుకు అధ్యక్షుడు జో బైడెన్ అభినందనలు తెలిపారు.






