ఎక్కడ ముప్పు ఉందో.. అక్కడే దృష్టి : జో బైడెన్
తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు వాటిని నియంత్రించడానికే తాము ఆప్ఘన్ నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. ఆ దేశం నుంచి దళాలను వెనక్కి రప్పించి, ముందు ఎక్కడ ఎక్కువ ముప్పు ఉందో అక్కడే దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఆఫ్గన్లో తాలిబన్లు మాత్రమే కాకుండా సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఆల్ ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రాబల్యం పెంచుకున్నారని తెలిపారు. ఆ ఉగ్రసంస్థలకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని చెప్పారు. అయితే, ఆఫ్ఘణ్ మొత్తాన్ని ఊహించిన దానికంటే వేగంగా తాలిబన్లు వశం చేసుకోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగా ఆఫ్ఘన్లో తమకు సాయపడ్డ సుమారు 30 వేల మంది శరణార్థులకు అమెరికా ఆశ్రయం ఇవ్వనుంది. అమెరికా దళాలకు సాయం చేసిన ఆఫ్ఘన్లు ఇప్పుడు తాలిబన్లు తమను ఏం చేస్తారోనని భయపడుతున్నారు. ఇప్పటికే పలువురిని తాలిబన్లు చంపేశారు. ఇప్పటికే పలువురిని తాలిబన్లు చంపేశారు. అమెరికా సాయం చేసిన వారిని గుర్తించేందుకు ఇంటింటికి వెళ్తూ తనిఖీలు చేస్తున్నారు.






