అమెరికా విదేశాంగ మంత్రితో జై శంకర్ చర్చలు
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అఫ్ఘానిస్థాన్లో తాజా పరిస్థితిపై ఫోన్లో మాట్లాడారు. కాబూల్లో విమానాశ్రయ కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జై శంకర్ నొక్కి చెప్పారు. భద్రత మండలి అద్యక్ష హోదా కింద భారత్ ఈ వారంలో జరగనున్న రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు అధ్యక్షత వహించడం కోసం జైశంకర్ న్యూయార్క్ వెళ్లారు. అఫ్ఘాన్లో పరిస్థితి గురించి ఆయన అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్తో ఫోన్లో మాట్లాడినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఆ వెంటనే జైశంకర్ కూడా అఫ్ఘాన్ పరిస్థితిపై తాను బ్లింకెన్తో మాట్లాడానని, అత్యవసరంగా కాబూల్ విమానాశ్రయం కార్యకలాపాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిపారు.






