తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు … ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి

తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ను ఇచ్చేందుకు ప్రభుత్వం యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి కనీసం సింగిల్ డోస్ ఇచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిరచారు. తెలంగాణలో టీకాకు అర్హులైన వారు 2.87 కోట్ల మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఇప్పటి వరకు 2.50 కోట్ల మంది కనీసం సింగిల్ డోస్ తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 87 శాతం వ్యాక్సినేషన్ పూర్తియింది. మొదటి డోసు టీకాను 1,81,430 మంది తీసుకోగా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 68,37,327 ఉంది. 18 నుంచి 44 ఏండ్ల వయసున్న వారిలో 1,01,03,812 మంది మెదటి డోసును, 26,78,710 మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు.