ఉత్కంఠగా ముగిసిన బెంగళూరు దశ పోటీలు……హైదరాబాద్లో రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సిద్ధమాయే
ఏ23 సమర్పణలో రూపే ప్రైమ్వాలీబాల్ లీగ్(పీవీఎల్) రెండో సీజన్ బెంగళూరు వేదికగా తొలి అంచె పోటీలు ఘనంగా ముగిశాయి. బెంగళూరు నగరంలో తొమ్మిది రోజుల వ్యవధిలో మొత్తం 10 మ్యాచ్లు అభిమానులను అలరించాయి. ప్రతీ రోజు వందల మంది అభిమానుల కేరింతలు, ఈలలతో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగాయి. తొలి అంచెలు పోటీలను ఘనంగా ముగించుకుని మలి పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ఈ నెల 15 నుంచి హైదరాబాద్లో పీవీఎల్ మ్యాచ్లు షురూ అవుతాయి. ఆతిథ్య హోదాలో హైదరాబాద్ బ్లాక్హాక్స్..తమ తొలి మ్యాచ్లో కొచ్చి బ్లూ స్పైకర్స్తో తలపడుతుంది.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ CEO Mr. జాయ్ భట్టాచార్య హైదరాబాద్లోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు మరియు నగరంలోని అభిమానులు ఈ సారి లీగ్ నుండి ఏమి ఆశించవచ్చనే దానిపై మాట్లాడారు.
“ఉత్కంఠభరితమైన వాలీబాల్ యాక్షన్ను ఆస్వాదించడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో మేము బెంగళూరులో అద్భుతమైన విజయాన్ని పొందాము. మేము ఇప్పుడు మళ్లీ హైదరాబాద్కి వస్తున్నాము, మేము చివరిసారి ఇక్కడ ఉన్నాము, కానీ అది కోవిడ్ సమయంలో జరిగింది. మాకు ఇప్పటికే నగరంలో భారీ అభిమానుల సంఖ్య ఉంది. ఇక్కడి స్టాండ్స్లో అభిమానులను తిరిగి చూడడానికి సంతోషిస్తున్నాము” అని అతను చెప్పాడు.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ ఓనర్ శ్రీ అభిషేక్ రెడ్డి కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు మరియు రాబోయే సంవత్సరాల్లో ఫ్రాంచైజీకి సంబంధించిన తన విజన్ గురించి క్లుప్తంగా వివరించారు.
“ప్రజల జీవితాల్లో ఉత్సాహాన్ని తీసుకురావడమే మా లక్ష్యం. వాలీబాల్ ఏ ఇతర క్రీడల్లాగే వినోదాత్మకంగా ఉంటుంది. ప్రతి సీజన్లో, మేము పరిమితులను మరింత పెంచడానికి ప్రయత్నిస్తాము మరియు ఆతిథ్య నగరం యొక్క అంచనా సామర్థ్యాన్ని మించి వాటిని ప్రయత్నిస్తాము. రాబోయే ఏడు రోజుల్లో, మేము మరియు హైదరాబాద్ నగరం మీ కోసం ఏమి కలిగి ఉన్నాయో, అలాగే వచ్చే సీజన్ నుండి మీరు ఏమి ఆశించవచ్చో మీరు చూస్తారు” అని అతను చెప్పాడు.
హైదరాబాద్లో తొలి మ్యాచ్కు ముందు బ్లాక్హాక్స్ కెప్టెన్ ఎస్వీ గురు ప్రశాంత్ మాట్లాడుతూ ‘కొచ్చి బ్లూ స్పైకర్స్ సామర్థ్యం గురించి మాకు పూర్తిగా తెలుసు. అందుకు తగ్గట్లు మేము పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకటి గెలిచాం. కోర్టులో కొచ్చి ప్లేయర్ల ఆటతీరును పరిశీలించాం. వారిని నిలువరించేందుకు వ్యుహాలు రచిస్తాం. సొంతగడ్డపై అభిమానులకు పూర్తి కిక్కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు.
కొచ్చి బ్లూ స్పైకర్స్ కెప్టెన్ విపుల్ కుమార్ మాట్లాడుతూ ‘లీగ్లో తొలి రెండు మ్యాచ్ల్లో చేసిన తప్పుల నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. ఈ సీజన్లో ఆడిన రెండింటిలోనూ ఓడిపోయాం. కచ్చితంగా పుంజుకుని పోటీలోకి వస్తామన్న నమ్మకం ఉంది. మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు. మా జట్టులో మెరికల్లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఆడిన రెండు గేముల్లో మాకు ఏది కలిసిరాలేదు. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం’ అని అన్నాడు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా హైదరాబాద్ బ్లాక్హాక్స్ తమ తొలి మ్యాచ్లో కొచ్చి బ్లూ స్పైకర్స్తో ఈనెల 15న రాత్రి 7 గంటలకు తలపడుతుంది.













