భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లే జరిగింది. రామ్నాథ్ కోవింద్కే పట్టం కట్టారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్ పై ఘన విజయం సాధించారు. కోవింద్కు 65.65, మీరాకుమార్కు 34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. రామ్నాథ్కు వచ్చిన ఓట్ల విలువ 7,02,644 కాగా, మీరాకుమార్కు వచ్చిన ఓట్ల విలువ 3,67,314. ఈ నెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవింద్ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.













