Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » New districts in ap 2

New Districts: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లు ఇవే..!?

  • Published By: techteam
  • August 18, 2025 / 01:39 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
New Districts In Ap 2

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన (Districts reorganization), కొత్త జిల్లాల ఏర్పాటు (New Districts), జిల్లాల పేర్ల మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత వైఎస్సార్‌సీపీ (YCP) ప్రభుత్వం 2022లో రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటికీ, ఈ విభజన సరిగా జరగలేదని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం జిల్లాల సరిహద్దులు, పేర్లు, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లా పర్యటనలు చేపట్టనుంది. ఆగస్టు 21న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

Telugu Times Custom Ads

ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా, వీటి సంఖ్యను 32కి పెంచే ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలతో అమరావతి జిల్లాను (Amaravati District) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే, ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వినతి సమర్పించారు. మదనపల్లి, గూడూరు, ఆదోని, పలాస, పోలవరం ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రాలకు ప్రయాణ దూరాన్ని తగ్గించి, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జిల్లాల పేర్ల మార్పు కూడా ఈ పునర్విభజనలో కీలక అంశంగా ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు ప్రముఖ కవి గుర్రం జాషువా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వినతి సమర్పించారు. అలాగే, కృష్ణా జిల్లాకు ‘వంగవీటి రంగా’ (Vangaveeti Ranga District) పేరు పెట్టే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను కూడా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని, కృష్ణా జిల్లాలోని కొత్తపల్లి, బిళ్లపల్లి, మడిచర్ల గ్రామాలను బాపులపాడు మండలం నుంచి తొలగించి నూజివీడు లేదా ముసునూరు మండలాల్లో కలపాలని వినతులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండల కేంద్రంగా మురపాకను మార్చాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నాయి.

జిల్లాల పునర్విభజనపై సమగ్ర అధ్యయనం కోసం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి, పి. నారాయణ, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాల్లో పర్యటించనుంది. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 2 వరకు కలెక్టర్ కార్యాలయాల్లో కూడా వినతులు స్వీకరిస్తారు. ఈ వినతుల ఆధారంగా సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 21న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

 

 

 

Tags
  • AP Govt
  • AP Politics
  • Chandrababu
  • New Districts
  • tdp

Related News

  • Minister Nara Lokesh Tour Tamil Nadu Updates

    Minister  Lokesh:ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి : మంత్రి లోకేశ్‌  పిలుపు

  • Anantapur Student Lands 1 Crore Internship Offer In Us

    Sai Saket: అనంతపురం వాసికి.. అమెరికాలో భారీ ప్యాకేజీ

  • Donald Trump To Meet China President Xi Jinping

    Donald Trump: త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంప్ భేటీ..?

  • U S Military Buildup In The Caribbean Sea

    Washington: టార్గెట్ వెనుజులా .. కరేబియన్ సముద్రంలోకి అమెరికా దళాలు..

  • Minister Lokesh Visits Sri Adichunchanagiri Math Discusses Free Education For Poor Students

    Minister  Lokesh :ఆదిచుంచనగిరి మఠాధిపతితో మంత్రి లోకేశ్‌ భేటీ

  • Ap Government Plans Major Reshuffle Of Ias Ips Officers Soon

    IAS  IPS: ఏపీలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు!

Latest News
  • Visa:భారతీయులకు మరో షాక్‌.. తక్షణమే అమల్లోకి!
  • Donald Trump: రెండోదశ ఆంక్షలు సిద్ధం : డొనాల్డ్‌ ట్రంప్‌
  • Minister  Lokesh:ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి : మంత్రి లోకేశ్‌  పిలుపు
  • JD Vance: వెనిజులాపై సైనిక చర్య మంచిదే :  జెడి వాన్స్
  • Sai Saket: అనంతపురం వాసికి.. అమెరికాలో భారీ ప్యాకేజీ
  • Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కు వ్యతిరేకంగా.. వాషింగ్టన్‌ డీసీలో
  • NATS: దాము గేదెల కు నాట్స్ సత్కారం…
  • Hyundai : అమెరికాలో హ్యుండమ్‌ ప్లాంట్‌పై దాడి
  • TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-హైవే’ విజయవంతం
  • Telusu Kadaa?: ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer