ఏపీలో పెరుగుతున్న కరోనా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,882 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,108 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా వైరస్తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,06,280 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్తో ఇప్పటి వరకు 14,510 మంది మరణించారు. కరోనా బారి నుంచి 696 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.