ఏపీ నుంచి వెళ్లేవారిని.. పొరుగు రాష్ట్రాలు

ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు విమర్శించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అతి తీవ్రమైన కరోనా సమ్యకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యత కల్పించలేదని విమర్శించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలనే బాధ్యతతోనే పోలిట్బ్యూరో సమావేశం నిర్వహించామన్నారు. కొవిడ్ రెండో దశ చాలా ఉధృతంగా ఉందన్నారు.
ఆంధప్రదేశ్ నుంచి వెళ్లేవారికి పొరుగు రాష్ట్రాలు నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నాయన్నారు. కొత్త స్ట్రెయిన్ ఎన్440కె కర్నూలులో ప్రారంభమై దేవ్యాప్తంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతుంటే దీనిపై అప్రమత్తంగా లేకుండా ఎన్440కే అసలు లేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రజలకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఏపీ పట్ల ఆంక్షలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకల కొరత లేదంటూ అస్యతాలు చెబుతున్నారని ఆరోపించారు. పార్టీ పరంగా కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నామని తెలిపారు. ఆన్లైన్ ద్వారా వైద్య సూచనలు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం ఇచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఇంకా ముందుకు తీసుకెళ్తానున్నామన్నారు. ప్రభుత్వానికి ఎన్నో వనరులున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు.