ఏపీలో స్వల్పంగా తగ్గిన కేసులు…

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11,421 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే 81 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,213కి చేరింది. గత 24 గంటల్లో 16,223 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 15,78,452 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,38,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,95,34,279 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,308 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాల్లో 13 మంది మృతి చెందారు.