విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. ముందస్తు బుకింగ్ : కేంద్రం

ఒమైక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ మరో సూచన చేసింది. ఒమైక్రాన్ ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చేవారు, లేదా గత 14 రోజుల్లో ఆ దేశాల్లో పర్యటించిన వారు ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం బుకింగ్ చేసుకోవాలని చెప్పింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో దిగే అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా టెస్టు కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలని పేర్కొంది. ఈ నెల 20 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని తెలిపింది.