దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. మూడు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. వరుసగా రెండో రోజు నాలుగువేలకు పైగా మరణాలు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,08,921 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,95,955 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా 4,157 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగాయని, ఇప్పటి వరకు 2,43,50,816 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 3,11,388 మంది కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 24,95,591 యాక్టివ్ కేసులున్నాయి. మరో వైపు టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 20,06,62,456 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.