దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,86,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,59,459 మంది బాధితులు కోలుకున్నారు. మరో 3,660 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,48,93,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 3,18,895 మంది వైరస్ బారిన పడి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20.57 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను అందజేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.