దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 20,19,773 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,31,456 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,07,832కు పెరిగింది. ఇప్పటి వరకు 2,61,79,085 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 3,35,102 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 21,85,46,667 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.